శ్రీశైలం ఆలయ ఏఈవో మోహన్ పై సస్పెన్షన్ వేటు!

  • గంగాసదన్ లో క్రిస్మస్ వేడుకలు
  • మోహన్ జరిపారని ఆరోపణలు
  • విచారణకు ఆదేశించిన దేవాదాయ డిప్యూటీ కమిషనర్
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఏఈవో మోహన్ పై ఆలయ ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. గతేడాది డిసెంబర్ 25న ఇక్కడి గంగా సదన్ లో మోహన్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దేవాదాయ డిప్యూటీ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం ఈవో రామచంద్రమూర్తి మోహన్ ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
SRISAILAM
EO
MOHAN
suspend
Kurnool District

More Telugu News